పెథాయ్ ఎఫెక్ట్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరిగిపోయింది.ముఖ్యంగా… తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న కోస్తా తీరంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా చలి పంజా విసురుతోంది.విపరీతంగా పెరిగిన చలిగాలుల కారణంగా ….ఇప్పటికే 9 మంది మృతిచెందారు.ఏపీలో 8 మంది, తెలంగాణ ఒకరు మృతి చెందారు.మృతి చెందిన వారి వివరాలు ఒకసారి పరిశీలిస్తే….
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలో వృద్ధురాలు మృతి చెందింది.మొగల్తూరు మండలం కొత్తకాయలతిప్పలో వృద్ధురాలు కృష్ణమ్మ మృత్యువాత పడింది.ప్రకాశం జిల్లా చీరాల ఐక్యనగర్లో చలిగాలులకు ఇద్దరు వృద్ధులు మృతి చెందారు.మృతులను వెంకయ్య(73), నూనె కుమారి(61)గా గుర్తించారు.ప్రకాశం జిల్లా వేటపాలెం బస్ షెల్టర్లో చలిగాలులకు వృద్ధుడు, విశాఖ జిల్లా హుకుంపేట మండలం దాలిగుమ్మడిలో చలిగాలులకు ఒక వ్యక్తి మృతి చెందారు.తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో వృద్ధురాలు మృతి చెందింది.
ఉప్పలగుప్తం మండలం భీమనపల్లిలో రంగయ్య(70)మృతి మృతి చెందాడు.ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొమ్ముగూడెంలో కాశీ (55) మృత్యువాత పడ్డారు.