రోజురోజుకూ సైబర్ నేరగాళ్ల బెడద ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే.ప్రతి విషయాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటూ… జనాలను బురిడీ కొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
ప్రస్తుతం ఏ పని చేయాలన్నా సైబర్ నేరగాళ్ల గురించి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇక తాజాగా సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయి భారీ మొత్తంలో డబ్బులు కాజేశారు.
ఇండియా మార్ట్ అనే సైట్ లో హోల్ సేల్ ధరలకే మాస్కులు గ్లౌజులు అందజేస్తామని హంగేరి దేశానికి చెందిన ఓ కంపెనీ పేరిట ఇటీవలే ఒక ప్రకటన విడుదలైంది.ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లోని ఓ హోల్సేల్ సంస్థ హంగేరి కంపెనీని సంప్రదించింది.
ఈ రెండు సంస్థలు తమకు సంబంధించిన కొటేషన్లు ఇచ్చిపుచ్చుకున్నారు.
ఈ క్రమంలోనే సరుకు పంపించాలంటే 50% పేమెంటు చేయాల్సిందేనంటూ అంటూ హంగేరీ సంస్థ ప్రతినిధి చెప్పారు.
దీంతో సదర్ హోల్సేల్ సంస్థ హంగేరి సంస్థకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కి 30 లక్షల ట్రాన్స్ఫర్ చేసింది, ఇక ఆ తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన ఫోన్ కి కాంటాక్ట్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది, దీంతో ఇది సైబర్ నేరగాళ్ల ప్లాన్ అనే గ్రహించిన సదరు సంస్థ యాజమాన్యం సైబర్ ఏసిపి కెవిఎం ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు.