మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్ష పదవికి సంబంధించి ప్రకాష్ రాజ్, విష్ణు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.సీవీఎల్ నరసింహారావు మొదట అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించినా కొన్ని కారణాల వల్ల పోటీ విషయంలో వెనక్కు తగ్గారు.
మ్యానిఫెస్టోను ప్రకటించిన తర్వాత సీవీఎల్ నరసింహారావు నామినేషన్ ను వెనక్కు తీసుకోవడం గమనార్హం.ఆ తర్వాత తాను మంచు విష్ణుకు సపోర్ట్ చేస్తున్నానని సీవీఎల్ నరసింహారావు చెప్పుకొచ్చారు.
తాజాగా సీవీఎల్ నరసింహారావు తనకు దాసరి గారు కలలోకి వచ్చి విష్ణు గురించి చెప్పారని అన్నారు.వినడానికి వెటకారంగా అనిపించినా దాసరిగారిని మరిచిపోలేమని సీవీఎల్ నరసింహారావు కామెంట్లు చేశారు.
దాసరి నారాయణరావు గారితో తనకు పెద్దగా పరిచయం లేదని కేవలం ఒకటిరెండు సార్లు మాత్రమే కలిశానని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం దాసరి గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని సీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.
కలలో దాసరి నారాయణరావు గారితో ఈ పరిస్థితి ఏమిటని అడిగానని దాసరి గారు మీరంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారని సీవీఎల్ నరసింహారావు చెప్పుకొచ్చారు.
మోహన్ బాబు తనను తండ్రిగా భావించారని విష్ణును తాను శిష్యుడిగా భావిస్తున్నానని దాసరి కలలో చెప్పారని సీవీఎల్ చెప్పుకొచ్చారు.మోహన్ బాబు వాళ్ల అబ్బాయి విష్ణుకు సంస్కారం నేర్పారని ఆ సంస్కారం వల్లే పెద్దలు చెబితే తప్పుకుంటానని విష్ణు చెప్పాడని దాసరి తనతో చెప్పినట్టు సీవీఎల్ కామెంట్లు చేశారు.
ఆ తర్వాత దాసరి గారు మీ వ్యవహారం ఏమిటని అడిగారని సీవీఎల్ వెల్లడించారు.తన దగ్గర అందరి ఫోన్ నంబర్లు లేవని చెప్పగా మీరు చేసేది మీరు చేయాలని దాసరి చెప్పారని సీవీఎల్ అన్నారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులను కలిసి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని సీవీఎల్ నరసింహారావు చెప్పుకొచ్చారు.
ఎన్నికలు లేకుండా విష్ణు ఏకగ్రీవం అయ్యే విధంగా సీవీఎల్ నరసింహారావు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.