ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోయింది.షాప్ కు వెళ్లి పది వస్తువులను చూసి, ఒకటి రెండు వస్తువలను తీసుకునే బదులు, ఆన్ లైన్ వందల రకాల వస్తువులను చూసి, అందులో తమకు అనువైనది తీసుకోవడం ఈ మధ్య ట్రెండింగ్ మారింది.
దీంతో టైమ్, డబ్బు రెండూ కలిసివస్తాయి.షాపింగ్ కు కేటాయించే సమయాన్ని ఇతర పని కోసమో లేదా కాలక్షేపం కోసం వినియోగించుకుంటున్నారు.
ఆన్లైన్ షాపింగ్లో గుండు సూది నుంచి చాలా విలువైన వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు.
మనకు సరైన వస్తువునే ఎంచుకునే అవకాశం ఉండటం, డెలివరీ అయిన తరువాతే డబ్బులు చెల్లించే ఛాన్స్ ఉండటంతో పాటు మనకు ఆ వస్తువు నచ్చకపోతే వారం నుంచి పది రోజుల్లో దానిని రిటన్ చేసే అవకాశం కూడా ఇస్తున్నాయి ఆన్లైన్ షాపింగ్ సైట్లు.
పండగ సమయంలో ఆఫర్లు పెట్టి ప్రజల నుంచి భారీగా ఆర్డర్లు కూడా తీసుకుంటున్నాయి.కరోనా వచ్చిన తరువాత చాలా మంది ఈ ఆన్లైన్ షాపింగ్ కే అలవాడు పడిపోయారు.
ఈ సైట్లలో ఎలక్ట్రానిక్, కాస్మొటిక్ లాంటి వస్తువలతో పాటు నిత్యవసరాలు, స్నాక్స్, కూరగాయలు కూడా లభిస్తున్నాయి.
అయితే కొన్ని సార్లు మనం ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకోటి వచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి.
బ్రిటన్లో ఓ వ్యక్తికి ఇలాగే జరిగింది.అతను దానిని అలాగే వదిలేయకుండా సోషల్ మీడియా దృష్టికి తీసుకురావడంతో ఇప్పుడది వైరల్గా మారింది.ఫిజిక్స్ టీచర్గా పని చేసే డేవిడ్ బాయ్స్ ఆన్లైన్లో ఆలూ చిప్స్ ఆర్డర్ పెట్టాడు.అయితే అతనికి అందులో ఆలూ చిప్ప్కు బదులుగా ఒక బంగాళదుంప కనిపించింది.
దీంతో అతడు దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.దీంతో ఆ సంస్థ స్పందించి అతడిని క్షమాపణలు కోరింది.
ఇంకో సారి ఇలా జరగకుండా చూసుకుంటామని చెప్పింది.