ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ కేసులో అదుపులోకి తీసుకున్న విజయ్ నాయర్ కస్టడీని పొడిగించారు.
పోలీస్ కస్టడీలో విజయ్ సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు.సాక్షుల సమాచారం ఆధారంగా విజయ్ నాయర్ ను ప్రశ్నించాలని సీబీఐ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు.
ఈ నేపథ్యంలో సీబీఐ అభ్యర్థనతో ఏకీభవించిన కోర్టు.విజయ్ కు మూడు రోజులు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సీబీఐ ఎఫ్ఐఆర్ లో ఏ5 గా ఉన్న విజయ్ నాయర్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.