2017 డిసెంబర్ 30, 31 తేదిలలో కాశ్మీర్ లోని లేత్పోరాలో CRPF క్యాంపు మీద జరిగిన దాడిలో పెద్ద కుట్ర దారుడైన, జైష్-ఏ-మహ్మద్ సంస్థకి చెందిన తీవ్రవాది నాసిర్ అహ్మద్ టాన్ ట్రె ని UAE నుండి మన దేశానికి తీసుకురావడంలో భారత్ విజయం సాధించింది.అప్పటి దాడిలో తీవ్రవాదులు భద్రతాబలగాల శిబిరంలోనికి చొరబడి నిద్రిస్తున్న మన జవాన్ల మీద కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే.5గురు CRPF జవాన్లు ఆ దాడిలో వీరమరణం పొందారు.అలాగే జవాన్లు జరిపిన ఎదురు దాడిలో ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు.
మరిగుజ్జు తీవ్రవాదిగా పిలువబడే, 4 అడుగుల ఎత్తు వుండే ఈ నాసిర్ ను UAE నుండి ఆదివారం ఉదయం డిల్లీ తెసుకొని వచ్చి, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కి అప్పగించారు.ఇతను ఈ సంవత్సరం మొదట్లో UAEకి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.
ఇతని తమ్ముడు నూర్ తానే ట్రె జైష్ లేత్పురా డివిజనల్ కమాండర్ గా పనిచేసేవాడు.కాశ్మీర్ లోయలో జైష్ బాగా బలపడటానికి ఈ అన్న దమ్ములిద్దరు కారణంగా చెబుతారు.
గత కొద్ది సంవత్సరాలుగా UAE కి భారత దేశంతో మంచి సంబంధాలు నెరుపుతోంది.భారతదేశం నుండి పారిపోయి, ఆదేశంలో తలదాచు కొంటున్న తీవ్రవాదులను, అనేక మంది నేరగాళ్ళను ఇటీవల భారతదేశానికి అప్పగించింది.
ముఖుల్ చోస్కి, ముకుల్ తల్వార్ వంటి ప్రముఖులు ఉన్నారు.