మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ కోసం జట్లు అన్ని కూడా దుబాయి చేరుకున్న విషయం తెల్సిందే.అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు సురేష్ రైనా అక్కడ వరకు వెళ్లి తిరిగి రావడం చర్చనీయాంశం అయ్యింది.
సరైన కారణం చెప్పకుండా రైనా ఈ సిరీస్ నుండి తప్పుకోవడంపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం చాలా సీరియస్ గా ఉంది.జట్టు నుండి అర్థాంతరంగా నిష్ర్కమించడంతో రైనా పై ధోనీ కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ సమయంలో జట్టుకు సంబంధించిన వాట్సప్ గ్రూప్ నుండి సురేష్ రైనాను యాజమాన్యం తొలగించిందనే ప్రచారం జరుగుతోంది.రైనా తీసుకున్న నిర్ణయంపై చర్చించిన ఇకపై అతడిని జట్టులోకి తీసుకోకూడదనే నిర్ణయానికి వచ్చారట.
ఆ కారణంగానే జట్టు సభ్యులు మాత్రమే ఉండే వాట్సప్ గ్రూప్ నుండి తొలగించారంటున్నారు.కొందరు మాత్రం రైనా స్వయంగా వాట్సప్ గ్రూప్ నుండి తప్పుకున్నట్లుగా చెబుతున్నారు.అసలు విషయం ఏంటీ అనేది తెలియాల్సి ఉంది.మొత్తానికి సీఎస్కేతో రైనా బంధం తెగిపోయింది.