ఎప్పుడు బాంబుల దాడులతో ఉగ్రవాదుల కార్యకలాపాలతో రణరంగంగా ఉండే అందమైన కాశ్మీర్ కి ఇప్పుడు పర్యాటకుల తాకిడి పెరిగింది.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు కాశ్మీర్ లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
పలు సినిమా షూటింగులు కూడా అక్కడ జరుగుతూ ఉన్నాయి.ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు కాశ్మీర్ లో పర్యాటకుల తాకిడి పెరిగింది.ఒక్క ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 1.62 లక్షల మంది పర్యాటకులు కాశ్మీర్ నీ సందర్శించారు.
రోజుకి కనీసం దాదాపు అరవై వేల మంది వస్తూ ఉన్నారు.ఈ పరిణామంతో కాశ్మీర్ రాష్ట్రంలో హోటళ్ళ ఆక్యుపెన్సి రేటు 95 శాతానికి చేరింది.అంతకుముందు ఇది 30 శాతానికి కూడా మించి ఉండేది కాదు.ఇక అద్దెలు 80 శాతానికి మేరా పెరిగాయి.
పర్యాటకుల తాకిడి పెరుగుతూ ఉండటంతో కాశ్మీర్ వాసులు తమకు ఉపాధి అవకాశాలు మరియు వ్యాపారం పెరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరోపక్క కేంద్ర భద్రత బలగాలు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది.