ఇక నుండి రైతులు పండించిన పంటను ఎక్కడ లాభం వస్తుందో అక్కడ అమ్ముకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు కూడా అవే చెబుతున్నాయని కరోనా కారణంగ రైతులు నష్టపోవొద్దని ప్రతి గ్రామాల్లో ఐకేపి కేంద్రాలను ఏర్పాటు చేసి దాన్యం కొనుగోలు చేసిందని, అందువల్ల ప్రభుత్వం 7,500 కోట్లు నష్టపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి అన్నారు.
కొన్న పంటకు మార్కెట్ లో సరైన ధర లేకపోవడంతో ఈ మేరకు నష్టంవచ్చిందని అన్నారు.వచ్చే ఏడాది నుండి రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చెయ్యదని వ్యాపార సంస్థకాదని అన్నారు.
అయితే ఈ విషయంపై నిన్నఆదివారం నాడు కేసిఆర్ ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సిఎంఓ ఓ ప్రకటనను విడుదల చేసింది.ఈ సమేవేశంలో పంట కొనుగోళ్ళు, నియంత్రిత సాగు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు–కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తుంది.
నేటినుండి తెలంగాణ రైతులకు రైతుబందు సాయం అందనున్నదని కేసిఆర్ తెలియజేశాడు.
.