సాధారణంగా మొసలిని చూస్తే ఎవరికన్నా భయం వేస్తుంది.అమ్మో మోసలా.
దానికి కనుక చిక్కితే మన ప్రాణాలు గాల్లో కలిసిపోవడం గ్యారంటీ అని అనుకుంటాము కదా.కానీ కొందరు వ్యక్తులు మాత్రం మొసలిని చూసి ఏ మాత్రం భయపడకుండా ఎదో ఒక కుక్కపిల్లని ఎత్తుకున్నట్లు ఎత్తుకుని భుజాల పైన ఎక్కించుకుని మరి మొసలితో సెల్ఫీలు దిగారు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.అసలు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో అనే విషయాలు ఒకసారి తెలుసుకుందాం.!
ఈ విచిత్రమైన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలో చోటు చేసుకుంది.ప్రస్తుతం శివపురి జిల్లాలో ఎన్నడూ లేని విధముగా, చాలా సంవత్సరాల తర్వాత అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఎక్కడ చుసిన నదులు, వాగులు, వంకలు, చెరువులు ఇలా అన్ని జలాశయాలు నిండు కుండలా మారి పొంగుతూ పరవళ్లు తొక్కుతున్నాయి.
ఈ క్రమంలోనే శివపురి నగరానికి దగ్గరలో ఒక జాతీయ ఉద్యానవన పార్క్ ఉంది.
ఈ పార్క్ లో అనేక మొసళ్ళు ఉంటాయి.అయితే భారీ వర్షాల కారణంగా నదులు బాగా ప్రవహించడంతో పార్క్ పక్కనే ఉన్న కాలువల నుంచి మొసళ్లు ప్రజలు నివసించే పట్టణ ప్రాంతాలలోకి వస్తున్నాయి.
ఈ క్రమంలో ఒక మొసలి శివపురి నగరంలోని మాంసం మార్కెట్లోకి వచ్చింది.ఆ మొసలిని చూసిన అక్కడి మార్కెట్లోని యువకులు కొంతమంది భయపడకుండా నీటిలో తడిచిన మొసలిని చాకచక్యంగా పట్టుకుని తాళ్ళతో బంధించారు.
అక్కడితో ఆగకుండా మొసలిని ఎత్తుకుని సెల్ఫీ ఫోజులిచ్చి ఫోటోలు కూడా దిగారు.అయితే మొసలిని భుజంపై ఎత్తుకున్న తరువాత కొంచెం సేపటికి అది ఆ వ్యక్తి భుజంపై నుంచి దూకి కిందకు పడిపోతుంది.
అప్పుడు అక్కడ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏ మాత్రం భయపడకుండా నవ్వడం మనం గమనించవచ్చు.అక్కడ నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది మొసలి.కానీ అది నోరు తెరిచి ఎవరికి అపాయం కలిగించకూడదని మూతి దగ్గర తాళ్లతో కట్టేయడం ఈ వీడియోలో చూడవచ్చు.అలాగే ముసలి శరీరాన్ని కూడా కదలకుండా తాళ్లతో కట్టి బంధించారు.
అందుకే ముసలి తప్పించుకోవడానికి ప్రయత్నించిన కానీ కుదరలేదు.అయితే అక్కడ చోటు చేసుకున్న ఈ ఘటన కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది.
ఆ తరువాత మొసలి గురించి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మొసలిని పట్టుకుని చంద్ పథ సరస్సులో వదిలిపెట్టారు.ప్రస్తుతం ఈ మొసలి వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకర్షిస్తుంది.