ఒకప్పుడు అయితే జంతువులు మనుషులను చంపేవి … జంతువులను చూస్తే మనుషులు భయపడి పరుగులు పెట్టేవారు… కానీ ఇప్పుడు రోజులు మారాయి.జంతువులు మనుషులను చంపడం కాదు మనుషులే జంతువులను దారుణంగా చంపుతున్నారు.
మృగాళ్లలా మారుతున్న మనుషులను చూసి జంతువులే పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
ఇప్పటికే కాలుష్యం కారణంగా కొన్ని అరుదైన జీవులు అంతరించి పోతుంటే.మనుషులు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ మరి కొన్ని జీవులను చంపుతున్నారు.
తాజాగా ఒడిషా రాష్ట్రంలో ఏకంగా మొసలి ని పట్టుకుని దాన్ని ఊరంతా వండుకొని తింటారు.ఈ ఘటన అటవీశాఖ అధికారులకు తెలిసి తెరమీదకు రావడంతో సంచలనంగా మారిపోయింది.
మల్కన్గిరి జిల్లా లో పోడియా బ్లాక్ కలదపల్లి గ్రామానికి చెందిన కొందరు ప్రజలు తమ గ్రామ సమీపంలో సబేరి నదిలో మొసలి పట్టుకున్నారు.ఐదు అడుగుల పొడవున్న ఆ మొసలి ముందుగా చేతులు కాళ్ళు నరికి చంపేశారు.
తర్వాత ఇక మొసలి మాంసాన్ని ముక్కలుగా చేసి ఊరంతా పంచి పెట్టడంతో ఊరంతా వండుకొని తిన్నారు.ఇక ఈ విషయం అటవీశాఖ అధికారుల వరకు వెళ్లడంతో దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు,
.