కరోనా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంది.వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇక హాలీవుడ్ లో కూడా చాలా మంది సెలబ్రిటీలు ఈ వైరస్ బారిన పడ్డారు.ఇప్పటికే లైంగిక ఆరోపణల కేసులో ఇరుక్కున్న హాలీవుడ్ నిర్మాతకి కరోనా పోజిటివ్ ఉందని తెలిసింది.
అలాగే జేమ్స్ బాండ్ హీరోయిన్ గా కూడా కరోనా పోజిటివ్ వచ్చింది.ఆమె ట్రీట్మెంట్ తీసుకొని బయటపడింది.
ఇలా చాలా మంది నటులు కరోనా బారిన పడ్డారు.తాజాగా కరోనా పోజిటివ్ తో ప్రముఖ హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ మృతి చెందాడు.
69 ఏళ్ల హాలీవుడ్ నటుడు మార్క్ బ్లమ్ కరోనా పోజిటివ్ కి చికిత్స పొందుతున్నాడు.హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించడంతో పాటు, ఈ మద్య కాలంలో వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తున్నాడు.
కరోనా వైరస్ సోకడంతో మార్క్ రెండు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అతను తాజాగా తుది శ్వాస విడిచారు.మార్క్ బ్లమ్ మృతి చెందిన విషయాన్ని ఆయన భార్య జానెట్ జరీస్ నిర్థారించారు.మార్క్ బ్లమ్ మృతితో ఆయన అభిమానులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
హాలీవుడ్ ప్రముఖులు కూడా ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.