మనకు మొసలి పేరు వింటేనే భయం కలుగుతుంది.ఎందుకంటే దాని బలం ముందు మన బలం ఏ పాటిది.
సాధారణంగా మొసలి నీళ్లలో నివసించే జీవి అయినప్పటికీ, కొన్నిసార్లు బయట దర్శనమిస్తూ ఉంటుంది.అయితే నీటిలో ఉన్నప్పుడు దాని బలం మాములుగా కంటే ఎక్కువ ఉంటుంది.
అలా నీళ్లల్లో ఉన్నప్పుడు ఆ మొసలి ఎవరి మీద అయినా ఎటాక్ చేస్తే ఇక వాళ్ళను కాపాడడం దాదాపు కష్టమే.అంత పట్టు ఉంటుంది దాని చేతుల్లో.
చూస్తూ చూస్తూనే మనుషులను అమాంతం నోటిలో వేసుకోగల సామర్థ్యం కలిగి అంటుంది.
అందుకే మనకు మొసలి పేరు ఎత్తితేనే వణుకు మొదలవుతుంది.
ఇక దానిని అనుకోకుండా చుస్తే గుండె జారీ చేతిలో పడుతుందేమో.తాజాగా భాగ్యనగరం లోని మూసీ నదిలో మొసలి కనిపించడం కలకలం రేపింది.
స్థానికులు మొసలిని చూడడంతో బయపడి పోయారు.వారు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
భాగ్యనగరం లోని మూసీ నదిలో ఒక మొసలి కనిపించి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.
హైదరాబాద్ లో నిన్న భారీ వర్షాలు కురిసాయి.
దీంతో ఈ భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి.హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాలకు భారీ వరద నీరు వచ్చి చేరడంతో గేట్లు ఎత్తి వేశారు.
దీంతో ఈ వరద నీరు అంత మూసీ నదిలోకి వచ్చి చేరింది.
ఆ నీటితో పాటు మొసలి కూడా కొట్టుకు వచ్చిందనుకుంటా.ఈ మొసలి స్థానికుల కంట్లో పడడంతో భయంతో వెంటనే అధికారులను సమాచారం అందించారు.
అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ఆ మొసలిని పట్టుకుని జూ కు తరలించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.ఇక ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.