జనాలు అన్ని రంగాలు పతనం అవుతున్నాయని భావించినా.మీడియా రంగానికి ఎంతో కొంత గౌరవం ఇస్తున్నారనే చెప్పుకోవచ్చు.
ఇతరు ఏదైనా చెప్తే నిజమా? కాదా? అని ఆలోచిస్తారు.కానీ మీడియా చెప్తే.
నిజమనే నమ్ముతారు.అందుకే ఆయా విషయాల్లో జనాలు ఇంకా మీడియా పట్ల గౌరవాన్ని కనబరుస్తున్నారు.
అయితే కొన్ని పత్రికలు, మీడియా సంస్థల వ్యవహార తీరు మాత్రం అన్ని రంగాల మాదిరిగానే తాముకూడా దిగజారిపోయాం అని చెప్పుకుంటున్నాయి.తాజాగా ఇదే పని చేసింది తెలుగునాట ఘనకీర్తి ఉన్న ఈనాడు పత్రిక.
ఇంతకీ తను చేసిన ఘన కార్యం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రామోజీరావు నడిపిస్తున్న పత్రిక ఈనాడు.
ఆయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.ప్రపంచంలోనే అత్యంత పేరొందిన రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించాడు.
ఈనాడు, ఈటీవీతో పాటు దేశ వ్యాప్తంగా పలు చానెళ్లు రన్ చేస్తూ.మీడియా దిగ్గజంగా కొనసాగుతున్నాడు.
అయితే ఆయన సైతం ప్రస్తుతం ఎలాంటి విలువలు పాటించకుండా పత్రికను మందుకు నడిపిస్తున్నాడు.తాజాగా ఇవాళ ఆయన పత్రిక చూస్తే.
డబ్బుకోసం రామోజీరావు ఏమైనా చేస్తాడా? అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది.ఇంతకీ ఆ యాడ్ ఏంటంటే.
పాన్ బహర్ అనే.తంబాకు ఉత్పత్తుల ప్రచార ప్రకటన.
నిజానికి ఇలాంటి ప్రకటనలు చేసేందుకు చాలా మంది సినీతారలు ఇష్టపడరు.
కానీ మహేష్ లాంటి హీరోలు ఈ యాడ్ చేసి సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు.అటు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ యాడ్ చేసి విమర్శలు రావడంతో వెనక్కి తగ్గాడు.అంతేకాదు.
తాను తీసుకున్న రెమ్యునరేషన్ కూడా వెనక్కి తీసుకున్నాడు.పలువురు పాన్ బహర్ యాడ్స్ చేసి నాలుక్కర్చుకున్నారు.
మార్షల్ ఆర్ట్స్ హీరో జాకీ చాన్ కూడా పాన్ బహర్ యాడ్ చేశాడు.అయితే ఇది పొగాకు ఉత్పత్తి అని తెలియడంతో వెంటనే తను తప్పుకున్నాడు.
సదరు కంపెనీ తనను మోసం చేసిందని ఆరోపించాడు.తాజాగా ఈ ఉత్పత్తికి సంబంధించిన యాడ్ ఈనాడులో రావడంతో చాలా మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు.
పద్మవిభూషన్ అందుకున్న రామోజీ. ఆ స్థాయి వ్యక్తిత్వాన్ని కనబర్చాలని హితవు పలుకుతున్నారు.