గతంలో పనిచేసిన ఉద్యోగ హోదా నే జనాలు గుర్తుపెట్టుకుని ఇంటిపేరుగా మార్చి పిలవడం ఒక వంతు అయితే, ఇప్పటికీ నీతికి నిజాయితీకి మారుపేరుగా ఆయనను చూస్తూ, ఆదరాభిమానాలు అందిస్తున్న వ్యక్తి వి.వి లక్ష్మీనారాయణ అలియాస్ జేడీ లక్ష్మినారాయణ.
తాను పనిచేస్తున్న ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీనారాయణ చాలాకాలం పాటు ఏపీ లోని అనేక ప్రాంతాల్లో పర్యటించి, చివరకు 2019 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు.ఆయన కు వచ్చిన ఓట్ల శాతం , ఆయన క్రేజ్ ను తెలియజేసింది.
ఇక అప్పటి నుంచి ఆయన విశాఖ కేంద్రంగానే రాజకీయ వ్యవహారాలు చేస్తున్నారు . జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేసినా, ఏ పార్టీలో చేరలేదు.బహుశా 2024 ఎన్నికల సమయంలో ఏదైనా పార్టీలో చేరే అవకాశం ఉంది.ఇప్పుడు లక్ష్మీనారాయణ ప్రస్తావన ఎందుకు వస్తోంది అంటే , ఇటీవల ఏపీ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి హైదరాబాద్ లో నిర్వహించిన కాపు సామాజికవర్గ కీలక సమావేశానికి జెడి లక్ష్మీనారాయణ కూడా హాజరు కావడం సంచలనం రేపింది.
కులాలకు అతీతంగా లక్ష్మీనారాయణను జనాలు చూస్తున్నారు.ఆయన రాజకీయాల్లో ఉన్నా.
నీతికి నిజాయితీకి మారు పేరుగానే ఆయన్ను చూస్తున్నారు. కానీ ఆయన కాపు సామాజికవర్గం మీటింగ్ కు వెళ్లి కుల ముద్ర వేయించుకోవడం మెజారిటీ జనాలకు రుచించడం లేదు.
తన కులానికి సంబంధించిన సమావేశానికి వెళ్లడం తప్పు కాకపోయినా, కులాలకు అతీతంగా లక్ష్మీనారాయణను జనాలు చూస్తున్న ఈ సమయంలోనే ఆయన ఈ విధంగా వ్యవహరించడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
కులాలకు , మతాలకు అతీతంగా గుర్తింపు పొందిన లక్ష్మీనారాయణ ఇప్పుడు ఒక కులానికి పరిమితమై పోయినట్టుగా కనిపిస్తున్నారు.రాబోయే రోజుల్లో తన రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి డోకా లేకుండా చేసుకునేందుకు లక్ష్మీనారాయణ ఈ సమావేశానికి వెళ్లినా, జనాలు మాత్రం ఇప్పుడు లక్ష్మీనారాయణ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.దీనికి కారణం ఆయనపై కుల ముద్ర పడిపోవడమే.