కలియుగంలో హనుమంతుడు అత్యధికంగా పూజలందుకునే దేవునిగా పేరొందాడు.హనుమంతుని నామం స్మరిస్తే కష్టాలు తీరుతాయని నమ్ముతారు.
అయితే దీనికి విరుద్దంగా హనుమంతుడిని పూజించడం నేరంగా పరిగణించబడే ప్రదేశం ఒకటి మన దేశంలోనే ఉంది.ఉత్తరాఖండ్లోని చమోలిలో ఉన్న దునగిరి గ్రామం గురించి ఒక కథనం ఉంది.
హనుమంతుడు.ఒకానొకప్పుడు అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణుని చికిత్స కోసం సంజీవని మూలికను తీసుకోవడానికి వచ్చిన ప్రదేశం ఇదేనని స్థానికులు నమ్ముతారు.
రామాయణ కాలంలో హనుమంతుడు సందర్శించిన ప్రదేశాలు నేడు పవిత్ర పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి.అయితే ఈ ప్రాంతంలోని ప్రజలు శ్రీరాముని సేవకుడైన హనుమంతుడిని పూజించరు.
గ్రామంలో హనుమాన్ భక్తులెవరూ కనిపించరు.రామాయణ కాలంలో యుద్ధం చేస్తున్నప్పుడు మేఘనాథుడి బాణం దెబ్బకు లక్ష్మణుడు మూర్ఛ పోయినప్పుడు, వైద్యుడు అతని చికిత్స కోసం సంజీవని మూలికను తీసుకురావాలని చెబుతాడు.దీంతో శ్రీ హనుమంతుడు సంజీవని కోసం వెతుకుతూ హిమాలయ పర్వతాలలో ఉన్న ఈ ప్రదేశానికి వస్తాడు.ఆ సమయంలో ఈ గ్రామానికి చెందిన ఒక మహిళ సంజీవని మూలికకు సంబంధించిన పర్వత భాగాన్ని అతనికి చూపించిందని చెబుతారు.
అయితే హనుమంతుడు ఆమె మాట వినకుండా పర్వతంలోని మూలికలు ఉన్న పర్వత భాగాన్ని పెకిలించుకుని తనతో తీసుకువెళ్లాడట.అప్పటి నుంచి స్థానికులు తరతరాలుగా హనుమంతునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.
అందుకే ఈ గ్రామంలో హనుమంతుని పూజించడం నేరంగా పరిగణిస్తారు.