టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి త్వరలోనే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు రానున్నట్లు సమాచారం.ఇటీవల సూపర్ ఫాంలో ఉన్న కోహ్లీకి రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
ఈ మేరకు కొద్దిసేపటి క్రితం బీసీసీఐ కేంద్రానికి ఓ లేఖ రాసింది.బీసీసీఐ ప్రతిపాదనలకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
అన్నీ కలిసొస్తే కోహ్లి కి ఖేల్ రత్న కన్ఫర్మ్ అని క్రీడా వర్గాలు అంటున్నాయి.ఈ వార్త తెలిసిన తరవాత కోహ్లీ అభిమానులలో సంతోషం వెల్లి విరుస్తోంది.
తమ సూపర్ స్టార్ ఆటగాడు అరుదైన గౌరవం దక్కించుకో బోతున్నాడు అనే సంతోషం లో ఉన్నారు వారు.మరొక పక్క రహనే కి అర్జున్ అవార్డ్ ని కేంద్రం సిఫార్సు చేయబోతోంది
.