ఇండియన్ క్రికెట్ టీంలో ఫాస్ట్ బౌలర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకొని తరువాత ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్ కి దూరమైనా కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్ గురించి అందరికి తెలిసిందే.క్రికెటర్ కెరియర్ మంచి పీక్ స్టేజిలో ఉన్న దశలో శ్రీశాంత్ చేసిన చిన్న తప్పు కారణంగా కెరియర్ మొత్తం పోగొట్టుకున్నాడు.
లేదంటే ప్రపంచంలో టాప్ బౌలర్స్ లో ఒకడిగా అతని పేరు నిలబడిపోయేది.అయితే అతని మీద ఐదేళ్ళు నిషేధం ముగిసిన తర్వాత క్రికెట్ లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేసిన బీసీసీఐ నుంచి అతనికి సానుకూలంగా నిర్ణయం రావడం లేదు.
దీంతో దేశవాళీలో ఆడే అవకాశం రావడం లేదు.
ఇక దీనిపై శ్రీశాంత్ చాలా రోజులుగా ఫైట్ చేస్తున్నాడు.
దీనిపై కోర్టుని కూడా ఆశ్రయించాడు.అయిన కూడా క్రికెట్ బోర్డ్ నుంచి అతనికి అనుమతి రావడం లేదు.
ఇదిలా ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న తర్వాత అతను సినిమాలలో చేస్తూ వచ్చాడు.సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేశాడు.
ఇప్పుడు ఓ మరాఠీ సినిమాలో చేస్తున్నాడు.కీలక పాత్రల కోసం శ్రీశాంత్ ని దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఇప్పుడు తన జీవిత అనుభవాల గురించి ఈ క్రికెటర్ కమ్ నటుడు ఆత్మకథ రాయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.ఆత్మకథ రాసిన తర్వాత బయోపిక్ రూపంలో దానికి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తానని చెప్పాడు.