పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో టీమిండియా దిగ్గజం సౌరవ్ గంగూలీ పాల్గొననున్నాడు.క్రికెట్ లో గాడ్ ఫాదర్ గా పేరొందిన దివంగత జగ్ మోహన్ దాల్మియా కుమార్తె వైశాలి బాలి నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు.
దీంతో ఆమె తరపు ప్రచారంలో గంగూలీ పాల్గొననున్నారని వైశాలి తెలిపారు.ప్రజా జీవితంలో తన తండ్రి వారసత్వాన్ని తాను తీసుకెళ్తానని ఆమె తెలిపారు.
ప్రచారం కోసం నిర్వహించనున్న ఫుట్ బాల్ మ్యాచ్ లో తన తరపున గంగూలీ ప్రచారం చేస్తారని ఆమె వెల్లడించారు.ఆమె పోటీ చేయనున్న నియోజకవర్గంలో ఏప్రిల్ 24న ఎన్నిక జరగనుంది.
క్రికెట్ ప్లేయర్ లకి పాలిటిక్స్ కొత్తేమీ కాదు కానీ, గంగూలీ లాంటి ఒక స్టార్ ఆటగాడు, పాత తరానికి వెన్నుముక ఐన లీడర్ – కెప్టెన్ ప్రచారం చెయ్యడం అంటే ఇప్పుడు బెంగాల్ లో ఈ వ్యవహారం పెద్ద విశేషంగా మారింది.