ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాధి భయంకరంగా విస్తరిస్తోంది.ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వల్ల పక్షులు, కోళ్లు ఇలా చాలా వాటిపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడింది.
దీంతో ప్రభుత్వం ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరణను ఆపడానికి ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ప్రముఖ పుణ్యక్షేత్రాలలోని పక్షులకు ఆ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి వచ్చే పర్యాటకులు పక్షులకు ఎటువంటివి ఇవ్వడానికి అనుమతి నిరాకరించింది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా భారత క్రికెటర్ శిఖర్ ధావన్ వారణాసిలో పర్యటించాడు.
ఆ సమయంలో నదిలో బోటులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ పావురానికి గింజలు తినిపిస్తున్న ఫోటోను తన వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసాడు.
ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారి కాంట్రవర్సీకి తెరదీసాయి.అయితే ఈ ఘటనలో ట్విస్ట్ ఏమిటంటే శిఖర్ ధావన్ మీద చర్యలు తీసుకోకుండా, ఎవరైతే శిఖర్ ధావన్ ప్రయాణిస్తున్న పడవను నడిపిస్తున్న డ్రైవర్ పై చర్యలు తీసుకొన్నారు.
పర్యాటకులపై చర్యలు తీసుకోమని, అలా చేయకుండా చేయాల్సిన బాధ్యత బోట్ డ్రైవర్ బాధ్యత అని ప్రభుత్వం తెలిపింది.పాపం ఏది ఏమైనా శిఖర్ ధావన్ చేసిన పనికి బోట్ డ్రైవర్ బలయ్యాడు.