సీఎం జగన్ ని కలిసిన క్రికెటర్ అంబటి రాయుడు..!!

తాడేపల్లి సీఎం క్యాంప కార్యాలయంలో క్రికెటర్ అంబటి రాయుడు( Cricketer Ambati Rayudu ) ఏపీ సీఎం వైఎస్ జగన్ నీ ( AP CM Jagan )మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఇదే సందర్భంలో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ ఎన్.

 Cricketer Ambati Rayudu Met Cm Jagan Details, Cricketer Ambati Rayudu, Ap Cm Jag-TeluguStop.com

శ్రీనివాస కుమార్తె రూప గురునాథ్ ఇతర చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పెద్దలు కూడా సీఎం నీ కలవటం జరిగింది.ఇటీవల ఐపీఎల్ 16వ సీజన్( IPL 16 ) ట్రోఫీని గెలవడంతో దానిని సీఎం జగన్ కి చూపించారు.

ఈ సందర్భంగా ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై జట్టు యాజమాన్యాన్ని అదేవిధంగా క్రికెటర్ అంబటి రాయుడిని ప్రత్యేకంగా అభినందించారు.

ఇదే క్రమంలో ఈ ఐపీఎల్ లో చెన్నై టీం సభ్యులఆటోగ్రాఫ్ తో కూడిన  జెర్సీనీ సీఎం జగన్ కు బహుకరించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనా ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి ఆసక్తిగా ఉన్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి అంబటి రాయుడు తీసుకెళ్లడం జరిగింది.ఇదే సమయంలో క్రీడారంగం పట్ల పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

ఇటీవలే ఐపీఎల్ కు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube