క్రికెట్ ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రపంచ కప్ ఆరంభంకు మరి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.క్రికెట్కు పుట్టినిల్లుగా చెప్పుకునే ఇంగ్లాండ్లో ఈసారి ప్రపంచ కప్ జరుగబోతున్న నేపథ్యంలో అందరు కూడా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.
సొంత గడ్డపై జరుపుకోబోతున్న సిరీస్ అవ్వడంతో దీన్ని దక్కించుకునేందుకు ఇంగ్లాండ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రతి జట్టు కూడా వరల్డ్ కప్ను గెలుచుకునేందుకు శాయశక్తులను ఒడ్డుతున్నాయి.
ఇండియా ది బెస్ట్ ఇచ్చేందుకు ఇప్పటికే సిద్దం అయ్యింది.ఐపీఎల్ కారణంగా ఎవరి సత్తా ఏంటీ అనేది ఒక అవగాహణకు మనం వచ్చాం.
ఇండియాకు కప్ గెలిచే సత్తా చాలా ఉందని ఇండియన్ క్రికెట్ అభిమానులు చాలా నమ్ముతున్నారు.విరాట్ కోహ్లీ కాస్త కూల్గా వ్యవహరిస్తే తప్పకుండా అద్బుతం ఆవిష్కారం అవుతుందని అంటున్నారు.
ఇక ఈ సారి ప్రపంచ కప్ విజేతకు కోట్ల వర్షం కురియబోతుంది.ఐసీసీఐ మొదటి ప్రైజ్గా 28 కోట్ల నగదు ఇవ్వబోతుంది.
ఇక రన్నరప్గా నిలిచిన వారికి 14 కోట్ల రూపాయలు దక్కబోతున్నాయి.సెమీ ఫైనల్ వరకు వచ్చిన జట్లకు 5.6 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ఐసీసీ ఇవ్వబోతుంది.మొత్తానికి ఇంత భారీ ప్రైజ్ మనీ ఎవరు దక్కించుకోబోతున్నారో చూడాలి.
ప్రైజ్ మనీ పక్కన పెడితే జీవితాంతం కూడా గెలుచుకున్న వారు గుర్తుంచుకునే తీపి గుర్తవుతుంది.