ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి అందరికీ తెలిసిందే.కాగా ఈ కరోనా వల్ల ఎన్నో ఆర్థికంగా, వాణిజ్య పరంగా నష్టాలు కూడా వచ్చాయి.
అంతేకాకుండా సినీ పరిశ్రమలు ఒకేసారి మూతపడ్డాయి.కరోనా విజృంభించక ముందు ఎన్నో సినిమాలు షూటింగ్ లు జరుగగా కరోనా దెబ్బతో అన్ని మధ్యలోనే ఆగి పోయాయి.
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో వచ్చిన ‘నిశ్శబ్దం’ చిత్రం.ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో అనుష్క నటించగా, హీరోగా మాధవన్ నటించారు.కాగా ఈ సినిమా గత ఏప్రిల్ 2 న విడుదల కావాల్సినప్పటికీ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది.ఇక ఓటిటి లో విడుదల చేయాలని ఆసక్తి లేకపోయినా తప్పక ఇప్పట్లో కరోనా నేపథ్యంతో సినిమా థియేటర్లు ఇక తెరుచుకోవని, చిత్రానికి వడ్డీలు చెల్లించడంలో ఇబ్బందులు అవ్వడంతో విడుదల చేశారు.
ఇదిలా ఉండగా అప్పుడే సినిమా హాల్ లు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా ఇది నిశ్శబ్దం టీంకు నిజంగానే షాక్ ఇచ్చి నిశ్శబ్దంకు గురిచేసింది.ఇక ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో విడుదల చేసినప్పటికీ హిట్ కొట్టలేదు.
ఈ సినిమాను ఏదైనా వెబ్ సిరీస్ కి తప్ప సినిమాల సెట్ అవ్వదని, ట్రైలర్ లో ఉన్న ఆసక్తి సినిమాల్లో అస్సలు లేదని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ల చేస్తున్నారు.
బాహుబలి తర్వాత అనుష్క నటించిన ఈ సినిమాలో తన అభిమానులకు కూడా నచ్చలేదని చెప్పాలి.
కాగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మరో క్రేజీ హీరో చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా ఇంతకుముందు సినిమాలలో దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ తెలుగులో లో ‘వస్తాడు నా రాజు’ చిత్రం ను చేయగా అదికూడా అనుకున్నంత క్రేజ్ తేలేదు.
అంతే కాదు హిందీలో కూడా మరో సినిమా దర్శకత్వం వహించిన అది హిట్ కొట్టలేకపోయింది.
దీంతో హేమంత్ అసలు ఇండస్ట్రీలో ఉంటాడో లేదో అని అనుకునే సమయానికి అతని దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి క్రేజీ హీరో ఒప్పుకున్నాడట.
ఇంతకీ అతను ఎవరో కాదు నిశ్శబ్దం చిత్రంలో నటించిన క్రేజీ హీరో మాధవన్.ఈయన హేమంత్ కి మళ్లీ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు.ఇక అతనితో తీయబోయే సినిమా హిట్ అవుతుందో లేక ఇది పోతుందో అని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.