ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిధుల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది అంటూ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.ఈ క్రమంలో ఏపీ ఖజానా కి సంబంధించి 41 వేల కోట్లు నిధుల దుర్వినియోగం జరిగిందనీ.ఆరోపించారు.41 వేల కోట్లకు లెక్కలు లేవు అంటూ వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేయడం జరిగింది.
ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ ఎడిటర్ జనరల్ తెలియజేస్తూ నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు.లెక్కల లోపాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసినట్లు స్పష్టం చేశారు.అదేవిధంగా గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని స్పష్టం చేశారు.ఎన్ని వేల కోట్ల నిధుల దుర్వినియోగానికి బాధ్యత ఎవరు వహిస్తారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ బాధ్యత మొత్తం సీఎం జగన్ వహించాలని.
నిధులు దుర్వినియోగం విషయంలో ప్రత్యేకంగా కాగ్ తో ఆడిట్ చేయించాలని.స్పష్టం చేశారు.ఇక ఇదే విషయం పై తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు.