ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇటీవల ఏపీ ప్రభుత్వం తెలుగు అకాడమీ పేరును.
తెలుగు సంస్కృత అకాడమీగా పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు.ఏపీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తెలుగుకు తెగులు పట్టించవద్దని.
కోరారు.తెలుగు అకాడమీ పేరు మార్చడం సరైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు.
నిజంగా సంస్కృతభాష పై ప్రభుత్వానికి అంత గౌరవం ఉంటే.సంస్కృత భాషకు ప్రత్యేకంగా మరో అకాడమీని స్థాపించాలని సూచించారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తెలుగు భాషకి గౌరవం లేకుండా పోతుందని.తక్కువ చూస్తున్నారని సిపిఐ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.అదే రీతిలో విద్యార్థులపై ఆంగ్ల భాష బలవంతంగా రుద్దటానికి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు.తెలుగు భాషను భగ్నం చేసే రీతిలో ప్రభుత్వం వ్యవహరించే తీరును ఖండిస్తున్నామని తెలిపారు.
తెలుగు అకాడమీ యథాతథంగా కొనసాగించాలని.తెలుగుభాషకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మాతృభాషను కాపాడుకోవాలి అంటూ వైసీపీ ప్రభుత్వానికి సిపిఐ రామకృష్ణ సూచించారు.
తాజా వార్తలు