ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ ఫైర్ అయ్యారు.
హిందుత్వాన్ని పక్కన పెట్టడానికి విశాఖ ఉక్కు ఉద్యమం తీసుకొచ్చారని సోము వీర్రాజు మాట్లాడటం అర్థరహితం మంటూ విమర్శించారు.ఢిల్లీలో సోము వీర్రాజు కి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి అని అందువల్లే వాళ్ల చేతగానితనాన్ని ప్రజలు గుర్తించకుండా కప్పిపుచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు అంటూ విమర్శల వర్షం కురిపించారు.
ప్రధాని అధ్యక్షతన ఎకనామిక్స్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది అని ఆ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ని 100% ప్రైవేటీకరణ చేయటానికి నిర్ణయం తీసుకున్నారని, ఇవన్నీ వాస్తవం కాదా అంటూ కే.రామకృష్ణ నిలదీశారు.కచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బిజెపి కుట్రలను ప్రజలు ఏమాత్రం క్షమించరు అంటూ సీరియస్ కామెంట్లు చేశారు.