ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అధ్వానంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు.ఇష్టానుసారంగా జగన్ పరిపాలన చేస్తున్నారని మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాన్ని అవినీతిమయం చేస్తూ.దోచుకుంటున్నారని.
వైసిపి ప్రభుత్వం ప్రమాదకరంగా మారిందని మండిపడ్డారు.వైసీపీ పాలన రివర్స్ లో ఉందని.
ఇక రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అయితే మరీ అధ్వానంగా ఉందని.గత రెండు సంవత్సరాలలో రాష్ట్రంలో రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు ఎందుకు డబ్బులు చెల్లించలేదని ప్రశ్నించారు.
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టైములో చెప్పింది ఒకటి అయితే ప్రస్తుతం చేసేది మరొకటి అంటూ మండిపడ్డారు.
అదేవిధంగా రాష్ట్రంలో అర్హులైన పెన్షన్ దారులకు ఎందుకు పెన్షన్ రద్దు చేశారనికూడా ప్రశ్నించారు.
అదే విధంగా విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 9వ తారీఖు నాడు విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని.ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే విషయంలో కేంద్రం.తాన అంటే రాష్ట్ర ప్రభుత్వం తందాన అన్నట్టు ఉందని మండిపడ్డారు.
విశాఖపట్టణం ముగ్గు కర్మాగారం విషయంలో కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఈ క్రమంలో ఈ నెల 21న విశాఖపట్టణంలో విశాఖ ఉక్కు పై భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు రామకృష్ణ స్పష్టం చేశారు.