మోడీ పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన సిపిఐ రామకృష్ణ..!!

సిపిఐ రామకృష్ణ ప్రస్తుతం దేశంలో ప్రజలు పడుతున్న అనేక ఇబ్బందులకు కారణం ప్రధాని మోడీ అని సీరియస్ కామెంట్లు చేశారు.గతంలో కరోనా వచ్చిన ప్రారంభంలో.

 Cpi Party Ramakrishna Serious Comments On Modi , Cpi Ramakrishna, Modi, Corona S-TeluguStop.com

ఇండియా లో వైరస్ విస్తరించకుండా ప్రధాని మోడీ యే కారణమని బీజేపీ నాయకులు గొప్పలు గర్వంగా చెప్పుకున్నారు.  మరి ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వైఫల్యానికి కారణం ఎవరు.? మోడీయే అంటూ రామకృష్ణ తీవ్రస్థాయిలో కేంద్రంపై బిజెపి పార్టీ పై మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వం ముందుచూపు లేకుండా ఎన్నికలు నిర్వహించడంతోపాటు కుంభమేళ నిర్వహించటం వల్ల దేశంలో 50 శాతం కేసులు నమోదు అయ్యాయి అని అన్నారు.

మోడీకి ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యము అన్నట్టు ముందు చూపు లేకుండా పని చేశారని, అసలు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎనిమిది దశల్లో పోలింగ్ నిర్వహించడం ఏంటి అని నిలదీశారు.దేశంలో పరిస్థితి చూస్తే గంగానదిలో డెడ్ బాడీ లు తేలుతున్నాయి అని మండిపడ్డారు.

మోడీ ప్రధాని గా ఉండటానికి అనర్హుడు అని వేరే వాళ్ళు ఆ స్థానంలో కూర్చోవాలని రామకృష్ణ కాంట్రవర్సి కామెంట్లు చేశారు.ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ తో పాటు చంద్రబాబు నాయుడు మోడీకి భయపడుతున్నారని.

ప్రశ్నించే ధైర్యం కూడా లేదంటూ సిపిఐ రామకృష్ణ విమర్శించారు.  

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube