ఏడేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆత్మ ఘోష వినిపిస్తుంది.. సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు.. ?

ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలువురు నాయకులు విమర్శల బాణాలను టీఆర్ఎస్ పార్టీ పై సందిస్తున్నారు.

 Cpi Party Narayana Sensational Comments On Kcr Government, Cpi Narayana, Sensat-TeluguStop.com

ఇప్పుడున్నది నిజమైన తెలంగాణ కాదని, ప్రత్యేక రాష్ట్రం సాధించామని భ్రమకు గురిచేస్తూ దోచుకుంటున్న దొంగల రాజ్యమని పలువురు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం పై దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపధ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ కూడా తనదైన శైలిలో రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డాడు.తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్ల పాలనలో ప్రజల ఆత్మ ఘోష వినిపిస్తుందని, తెలంగాణ కోసం తెగించి కొట్లాడిన ఉద్యమకార్ల ఊసే లేని పార్టీని స్దాపించి వారి సమాధుల మీద సామ్రాజ్యం ఏలుతున్నాడంటూ విమర్శించారు.ఇలా 1500 మంది యువకులు బలిదానంతో పాటుగా, అన్ని పార్టీలు చేసిన పోరాటం మొత్తాన్ని కేసీఆర్ తన అకౌంట్లో వేసుకుని తన వల్లే తెలంగాణ వచ్చిందనే భ్రమలో ఉన్నారని, అసలు పోరాటంలో పాల్గొనని వారు పదవులు ఏలుతూ దోపిడి చేస్తున్నారని ధ్వజ మెత్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube