ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పై సీ.పీ.
ఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ విమర్శల వర్షం గుప్పించారు.ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షులు ఎల్.గోవింద రావు, ముఖ్య కార్యదర్శి ఎం.వెంకటరమణ, కార్యదర్శి సురేష్ కుమార్ తదితరులు తమ డిమాండ్లను పరిష్కరించాలని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షను నారాయణ నిమ్మరసం రసం ఇచ్చి విరమింప జేశారు.తదనంతరం మీడియాతో మాట్లాడుతూ గద్దె నెక్కించిన యువతనే మోసం చేస్తే అదే యువత చేతుల్లో మళ్లీ తన భవిష్యత్తు ఉంది అని చంద్రబాబు మరచిపోకూడదు అని ఆయన అన్నారు.ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలి అన్న నినాదంతో ముందుకు వెళ్ళిన యువతను గద్దె ఎక్కిన తరువాత చంద్రబాబు మరచిపోయాడని.
కాంట్రాక్ట్ విధానం రద్దుతో పాటు అనేక వాగ్ధానాలు చేసిన బాబు ఇప్పుడు అవేమి పట్టించుకోకుండా ఉద్యోగ ఖాళీల బర్తీకు కాంట్రాక్ట్ విధానాన్ని, మరియి ఔట్ సోర్సింగ్ ను అవలంబిస్తూ దళారులను పెంచి పోషిస్తున్నట్లు ఆయన విమర్శించారు.ఇదే విషయమై ముఖ్యమంత్రికి లేఖ సైతం రాసేందుకు ఆయన సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.