ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు పని చేస్తున్నట్లుగా ఫోటోలకు ఫోజులివ్వడం ఇంత వరకు మనకు తెలిసిందే.కొందరు బట్టలు ఉతికితే, మరి కొందరు ఇస్త్రీ చేస్తూ, దోశలు వేస్తూ, కూరగాయలు అమ్ముతూ ఇలా రకరకాల పనులు చేస్తున్నట్లుగా ఏదో తనకు ఓట్లుపడాలని చేయడం రాని పనులను చేస్తూ ఓటర్లను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు.
కానీ సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాత్రం బిల్డప్ ఇవ్వకుండా ఉపాధి కూలీగా మారిపోయారు.
చిత్తూరు జిల్లా నగరి మండలంలోని అయినంబాకంలో రెండు రోజులుగా ఆయన చెరువు పూడికతీత పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొని ఉపాధి పనులు చేస్తున్నారు ఇక ఈ విషయం తెలిసిన వారు కొంత ఆశ్చర్యానికి లోను కావచ్చూ.కానీ ఇది నిజ ఇకపోతే నారాయణ గారు మాట్లాడుతూ.
వేసవిలో ఉపాధి పనులు జరిగే చోట కూలీలకు మజ్జిగ అందించేవారని, చిన్న పిల్లల కోసం టెంట్లు వంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవని, కానీ ఇప్పుడు అలాంటి సదుపాయాలేమీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు అదీగాక ఈ ఉపాధి పనుల్లో పాల్గొనేందుకు తనకు జాబ్ కార్డు లేదని, దీంతో శ్రమదానం చేశానని పేర్కొన్నారు ఏది ఏమైన ఒక పేరున్న రాజకీయ నేత ఇలాంటి పనుల్లో పాల్గొనడం నిజంగా గ్రేట్ అంటున్నారు ఈ విషయం తెలిసినవారు.