ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయమై సిఫార్సు చేసేందుకు ఏర్పాటు చేయబడ్డ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్.దీని నివేదిక నిన్న సీఎం చేతుల్లోకి వచ్చింది.
ఈ నివేదికలో అమరావతి మాత్రమే కాకుండా వైజాగ్ మరియు కర్నూలు కూడా అభివృద్ది చెందితేనే ఏపీ అభివృద్ది చెందుతుందని, అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందని నివేదికలో పేర్కొనడం జరిగింది.రాజధాని కోసం రెండు ఆప్షన్స్ ఇస్తూ సదరు గ్రూపు నివేదిక ఇవ్వడం జరిగింది.
బీసీజీ ఇచ్చిన నివేదిపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.బీసీజీపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
బీసీజీ నివేదిక అంటూ ఏమీ లేదని జగన్ డిక్టేట్ చేస్తుంటే విజయసాయి రెడ్డి రాసిందే బీసీజీ నివేదిక అంటూ చెబుతున్నారు అన్నాడు.రాత్రికి రాత్రి జగన్ దీనిని తయారు చేయించాడు.
తనకు అనుకూలంగా ఉండేలా దీనిని రాయించుకున్నాడు తప్ప జనాల్లోకి వెళ్లి ప్రశ్నించి, పరిశీలించి లోతుగా అద్యయనం చేసి తయారు చేసిన నివేదిక కాదు అంటూ నారాయణ ఎద్దేవ చేశాడు.ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం ఉండాలి.
కాని వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం లేదు.వైకాపా గత ప్రభుత్వాలు చేసిన చట్టాలను తుంగలో తొక్కడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అంటూ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీజీ నివేదికపై ఇంకా పలువురు విమర్శలు చేస్తున్నారు.