ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులు సర్దుకోవాలంటే, బాగు పడాలంటే మాత్రం తప్పని సరిగా కేసీఆర్, చంద్రబాబు నాయుడు మరియు జగన్లు కలవాలి అంటూ సీపీఐ నేత నారాయణ అన్నారు.మోడీ ఎన్నికల ఫలితాల తర్వాత మూడు నామాలే మిగిలుతాయంటూ నారాయణ పేర్కొన్నాడు.
పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, అది మోడీ ప్రభుత్వంపై ప్రభావం పడబోతుందని ఈ సందర్బంగా నారాయణ అన్నాడు.
దేశంలోని లౌకిక విధానంతో ఒక కూటమి ఏర్పాటు కావాల్సి ఉంది.
అందుకోసం కేసీఆర్, చంద్రబాబు నాయుడు, జగన్ కలవాలని తాను అభిప్రాయ పడుతున్నాను.అందుకోసం ప్రయత్నాలు జరగాలని భావిస్తున్నాను.
నెలకు 80 లక్షలు కేవలం మేకప్ కోసం ఖర్చు చేసే మోడీ ఈ దేశంకు సరైన ప్రధాని మాత్రం కాదంటూ ఈ సందర్బంగా ఆయన చెప్పుకొచ్చాడు.పుల్వామా ఉగ్ర దాడిని మోడీ రాజకీయాల కోసం వినియోగించుకున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అసలు పుల్వామ దాడికి కేంద్ర ప్రభుత్వం కారణం అంటూ నారాయణ విమర్శలు చేశాడు.సుప్రీం కోర్టు, సీబీఐ, ఆర్బీఐ ఇలా అన్ని సంస్థలను కూడా నిర్వీర్యం చేసిన ఘనుడు మోడీ అంటూ నారాయణ అన్నాడు.
ప్రతిష్టాత్మక సంస్థలను బట్టలు లేకుండా నడి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత మోడీకే దక్కుతుందని ఈ సందర్బంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.అందుకే దేశంలోని లౌకికవాదం బతకాలి అంటే ఖచ్చితంగా ఈ ముగ్గురు కలవాల్సిందే అంటూ నారాయణ అంటున్నాడు.
మరి ఈ ముగ్గురు కలవడం అనేది ఖచ్చితంగా కష్టమే.