పెట్రోల్ బంక్ లో జరుగుతున్న మోసాలపై సీపీ సజ్జనార్ సమావేశం ఏర్పాటు చేశారు.పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తక్కువగా వచ్చి, మీటర్ మాత్రం కరెక్ట్ గా చూపించేలా ఎలక్ట్రానిక్ చిప్ లను అమర్చే ముఠాలను, నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు ఆయన అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 13 పెట్రోల్ బంకుల్లో ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని, దాడులు నిర్వహించగా నేరం రుజువు కావడంతో వాటిని సీజ్ చేయడం జరిగిందన్నారు.ఏపీలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న 22 బంకులను అక్కడి పోలీసులు సీజ్ చేశారన్నారు.
ఈ మోసాల వెనుక శుభమ్ పాషా అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా.ఇతడి ఆధ్వర్యంలో సైబర్ పరిధిలోని అనేక ముఠాలను అరెస్ట్ చేశామన్నారు.
మహారాష్ట్ర నుంచి ప్రత్యేక చిప్ లను తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చి ఇక్కడి పెట్రోల్ బంకు నిర్వాహకులతో చేతులు కలిపి మోసాలకు పాల్పడుతున్నారన్నారు.పెట్రోల్ డిస్ ప్లే మిషన్ లోపల 2 చిప్ లను అమర్చి కరెక్ట్ మీటర్ చూపించే విధంగా భారీ మోసం చేస్తున్నారన్నారు.
రోజూ రూ.లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారని, ప్రతి వెయ్యి మిల్లీ లీటర్ల పెట్రోల్ లో 30 మిల్లీ లీటర్ల ఇంధనం తక్కువగా వస్తుందన్నారు.ఈ మోసాలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టబోతున్నామని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.