దేశంలోని కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇంత క్రూరమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నామా అని ఒక్కోసారి అనిపిస్తోంది.ప్రస్తుత సమాజంలో కామాంధులు మహిళలపైనే కాకుండా మూగ జీవాలపై కూడా తమ ప్రతాపం చూపిస్తున్నారు.
తాజాగా కేరళలో ఓ వ్యక్తికి చెందినటువంటి ఆవుపై అత్యాచారం చేసి హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లా మన్నార్ కార్డు ప్రాంతంలో గ్రామానికి చెందినటువంటి వినోద్ కుమార్ అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తుంటాడు.
ఇందులో భాగంగా పాల కోసం మేలు జాతి ఆవులను కొంటూ అమ్ముతూ ఉంటారు.ఈ క్రమంలో పాలను చుట్టుపక్కల గ్రామంలో అమ్ముతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు.
అయితే ఈ వారంలోనే సోమవారం రోజున తన ఆవు కనిపించకుండా పోయింది.దీంతో వినోద్ కుమార్ తను నివాసం ఉంటున్న తువంటి చుట్టుపక్కల ప్రాంతంలో వెతికాడు.
ఈ క్రమంలో నివాసానికి కొంత దూరం ఉన్నటువంటి ఓ ముళ్లపొదల్లో ఆవు మృతదేహం ఆచూకీ లభ్యమైంది.
అయితే ఆవు మృతదేహం అనుమానాస్పదంగా కనిపించింది.ఈ క్రమంలో ఆవు మర్మాంగాలపై పలు గాయాలు ఉండటంతో అనుమానం వచ్చినటువంటి వినోద్ కుమార్ ఆవు మృత దేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.అంతేగాక ఆవుపై అత్యాచారం జరిగినట్లు వినోద్ కుమార్ ఆరోపణలు చేస్తున్నాడు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని బాధితుడు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే వినోద్ కుమార్ ఆరోపిస్తున్నట్లు ఆవు అత్యాచారానికి గురైందా లేదా అన్న విషయాలను మాత్రం పోలీసులు బయటపెట్టడం లేదు.
.