మామూలుగా ఆవు మూత్రానికి ఎంతగానో డిమాండు ఉంటుంది అన్న విషయం తెలిసిందే.కొంత మంది హిందువులు ఆవు మూత్రాన్ని దైవ ప్రసాదంగా కూడా భావిస్తూ ఉంటారు.
ఎందుకంటే ఆవు మూత్రంలో ఎక్కువగా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి… ఆవు మూత్రాన్ని కొనుగోలు చేయడానికి ఎందుకు వస్తారు చాలామంది.కానీ ఆవు పేడ ని ఎవరైనా కొనుగోలు చేస్తారా.
కానీ ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు.ఏకంగా ఆవు పేడ కిలో రెండు రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు.కొనుగోలు చేసేది మరెవరో కాదు ఏకంగా ప్రభుత్వమే ఆవు పేడను కొనుగోలు చేస్తుంది.తాజాగా ఆవుపేడను కిలో రెండు రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు చత్తీస్ఘడ్ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
గోదాన్ నయా యోజన పథకం కింద.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల నుంచి ఆవుపేడను కిలో రెండు రూపాయల చొప్పున సేకరించాలని చత్తీస్ఘడ్ సర్కారు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి ఆవుపేడను కొనుగోలు చేసి… సహకార సంఘాల ద్వారా వర్మి కంపోస్టు ఎరువును తయారు చేసి రైతులకు కి ఎనిమిది రూపాయల చొప్పున విక్రయించాలి అని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.ఇక వర్మి కంపోస్టు ఎరువు తయారు చేసేందుకు అటు సహకార సంఘాలకు రుణాలను ఇప్పించి చేయూతనివ్వాలని చత్తీస్గడ్ సర్కార్ నిర్వహించింది, ఇలా ఆవుపేడను కొనుగోలు చేయడం ద్వారా అటు రైతులకు మేలు జరగడం తో పాటు వర్మి కంపోస్టు ఎరువును తయారు చేయడం ద్వారా సేంద్రియ వ్యవసాయం రాష్ట్రంలో ఎంతగానో అభివృద్ధి చెందుతుందని చత్తీస్ఘడ్ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.