కరోనా వైరస్ ప్రభావం ప్రపంచంపై ఎంత ఉంది పడింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి.
బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని.ఎలాంటి లక్షణాలు ఉన్న కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు, ప్రభుత్వం చెప్తూనే ఉంది.
అలాంటి సమాయంలో ప్రజలు కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి.కానీ బాధ్యత వ్యవహరించడం పక్కన పెట్టి కరోనా పార్టీనే పెట్టారు అమెరికాలోని కొందరు యువకులు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.తాజాగా ‘కోవిడ్-19 పార్టీ’ పేరుతో ఓ ప్రకటన చేశారు.
ఇంకా ఆ ప్రకటన ముఖ్య ఉద్దేశం తెలిస్తే ఎవరైనా సరే దేవుడా అని అంటారు.అలాంటి పార్టీ అది.
అమెరికాలోని అలబామాలో కొంతమంది విద్యార్థులు ‘కోవిడ్-19 పార్టీ’ పేరుతో ఒక ప్రకటన చేశారు.ఇంకా ఈ పార్టీకి ఒక కరోనా బాధితుడిని అహానిస్తారు.
ఇంకా ఈ పార్టీలో పాల్గొనే యువత కరోనా వైరస్ ను అంటించుకోవడానికి ప్రయత్నించాలి.అలాగే ఆ పార్టీలో ఉండే ఒక హుండీలో డబ్బు వెయ్యాలి.
ఇంకా పార్టీ పూర్తైన తర్వాత ఎవరికతే కరోనా పాజిటివ్ వస్తుందో వారు ఈ పార్టీలో విజేతగా నిలుస్తారు.ఇంకా ఆ హుండిలోని డబ్బు మొత్తాన్ని ఆ విజేతకు ఇచ్చేస్తారు.
ఇంకా ఈ దారుణమైన పార్టీ గురించి తెలుసుకున్న కొందరు పోలీసులు ఆ పార్టీలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకొని భగ్నం చేస్తున్నారు.ఏది ఏమైనా బాధ్యతగా వ్యవహరించాల్సిన యువతే ఇలాంటి చెత్త ఐడియాలతో కరోనా వ్యాప్తి చేస్తున్నారు.