భారతదేశంలో టీకాల తయారీలో కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్న సంస్థ బెంగళూరు లోని సిరం ఇన్స్టిట్యూట్.ఈ సంస్థ ప్రపంచంలోని అతి పెద్ద ఉత్పత్తి సామర్థ్యం కలిగిన టీకా తయారీ సంస్థ.
ఈ కారణం చేతనే భారతదేశంలో ఉన్న 120 కోట్ల పైగా జనాభా కి అవసరాలను తీర్చేందుకు ఈ సంస్థ అనువైనదని నిపుణులు ఆలోచిస్తున్నారు.ముందు ముందు రోజుల్లో దేశంలో కరోనా వ్యాక్షిన్ అభివృద్ధి చేసి సరఫరా చేసేందుకు ఈ సంస్థ అనువైనవిగా నిపుణులు ఆలోచిస్తున్నారు.
ఎన్నో కంపెనీలు కూడా సీరం ఇన్స్టిట్యూట్ వైపే ఆశలు పెట్టుకున్నాయి.
ఆక్స్ఫర్డ్ నుండి విడుదలయ్యే ఈ టీకా వెయ్యి రూపాయల వరకు ఉండవచ్చని భావిస్తుండగా, భారతదేశంలో సీరం అదే ఒక వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి కేవలం 250 రూపాయలకు అందించగలరని కేంద్రానికి సీరం ఇన్స్టిట్యూట్ వారు ప్రతిపాదించినట్టు సమాచారం.
ప్రస్తుతం కరోనా వైరస్ సంబంధించి ఇంకా ధరల కొరకు వేరే దేశాలతో కేంద్ర ప్రభుత్వం భారీ ఒప్పందం కుదుర్చుకుంటున్న నేపథ్యంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు బిజినెస్ వర్గాలు ఆలోచిస్తున్నాయి.అయితే ఈ విషయంపై మాత్రం సీరం ఇన్స్టిట్యూట్ ఇంతవరకు ఎలాంటి వాక్యాలను స్పందించలేదు.
టీకా పంపిణీ విషయంలో మొదటి నుంచి అత్యవసర విభాగానికి ముందుగా వినియోగించి, ఆ తర్వాత పూర్తి గా ప్రజలకు ఇవ్వడానికి అనుమతిస్తారని ఇటీవలే ఔషధ నియంత్రణ సంస్థ కు సీరం ఇన్స్టిట్యూట్ దరఖాస్తు కూడా చేసుకుంది.దేశ ప్రజల కోసం సాధ్యమైనంత తొందరగా విడుదల చేసేందుకు ఆ దేశ కేంద్ర ప్రభుత్వం కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని మరోవైపు బ్రిటన్ దేశ ప్రభుత్వం వారి ప్రజల కోసం టీకా పంపిణీకి సిద్ధం కాగా మరోవైపు భారతదేశంలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో మన దేశ కేంద్రం కూడా వ్యాక్సిన్ అందించాలన్న వైపు అడుగులు వేస్తోంది.ఈ విషయంపై ఫైజర్ కంపెనీ టీకాల పనితీరు ముగింపు ప్రక్రియను వేగవంతం చేసిందని సమాచారం.