కరోనా కారణంగా పలు దేశాలు ఆయా దేశాలలోకి విదేశీయులు వచ్చే విషయంపై పలు ఆంక్షలు విధించాయి.మొదటి వేవ్ సమయంలో భారత్ లోకి విదేశీయులు రాకుండా ఆంక్షలు విధించిన భారత ప్రభుత్వం, విదేశాలు వెళ్ళే భారతీయులపై కూడా ఆంక్షలు విధించింది.
అలాగే భారత్ నుంచీ వచ్చే ప్రయాణీకులపై దాదాపు అన్ని దేశాలు ఆంక్షలు విధించాయి.అయితే ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో భారత్ పై విధించిన ఆంక్షలు ఒక్కొక్కటిగా వెనక్కి తీసుకుంటున్నాయి.
ఈ నేపధ్యంలో
కువైట్ వచ్చే వారు ఎలాంటి ఆందోళన చెందకుండా వచ్చేయచ్చని కువైట్ లోని భారత ఎంబసీ కీలక సూచనలు చేసింది.భారత్ లోని కరోనా వ్యాక్సిన్ కోవిషిల్డ్ కు కువైట్ లో అనుమతి లభించిందని గతంలో ఈ టీకాకు కువైట్ అనుమతులు ఇవ్వకపోవడంతో ప్రవాసులు కువైట్ రాలేకపోయారని ప్రస్తుతం అనుమతులు ఇచ్చిన నేపధ్యంలో వాక్సినేషన్ సర్టిఫికెట్ తో కువైట్ రావచ్చని తెలిపింది ఎంబసీ.అయితే
వ్యాలిడ్ రెసిడెన్సీ సర్టిఫికెట్ తో పాటుగా ఉద్యోగ సంభదిత దృవీకరణ పత్రాలు కూడా తెచ్చుకోవాలని సూచించింది.అది కూడా విదేశీయులపై విధించిన బ్యాన్ తొలగిన తరువాత మాత్రమే దేశానికి రావచ్చని తెలిపింది.
మొదటి డోస్ వేసుకున్న సర్టిఫికెట్ ను అప్లోడ్ చేసి అదే లింక్ ద్వారా రెండవ డోస్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాలని సూచించింది.రెండు డోసులకు సంభందించిన సర్టిఫికెట్ లను పీడీ ఎఫ్ ఫార్మేట్ లో 500kb లోపు ఉండేలా చూసుకుని అప్లోడ్ చేయాలని తెలిపింది.ఇదిలాఉంటే
అధికారికంగా ఇచ్చిన ఈ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఎంబసీ తెలిపింది.వ్యాక్సిన్ సర్టిఫికెట్ పొందు పరిచినపుడు దానిపై పాస్ పోర్ట్ నెంబర్ తప్పకుండా వేయాలని సూచించింది.
ఈ ప్రక్రియ కోసం ముందుగా
అనే పోర్టల్ లోకి వెళ్లి తరువాత
“రైజ్ ఏ ఇష్యూ” ని సెలెక్ట్ చేసుకోవాలి తరువాత
“పాస్ పోర్ట్ “ ఆప్క్షన్ లోకి వెళ్ళాలి అందులో
“పాస్ పోర్ట్ నెంబర్ “ ఎంటర్ చేసి “సబ్మిట్ “ చేయాలి…
.