గత సంవత్సరం నుండి ప్రజల జీవితాల్లో తీపి జ్ఞాపకాలు అంటూ ఏవీ లేవు.అన్నీ చేదు ఘటనలే మస్తిష్కం నిండా నిండిపోయాయి.
ఆనందంగా సాగుతున్న బ్రతుకుల్లోకి కరోనా అనే రక్కసి చొరబడటంతో మనుషుల జీవన రేఖలు పూర్తిగా మారిపోయాయి.
ఇక దేశంలో ప్రస్తుత పరిస్దితులనైతే అంచన వేయడం కష్టంగా మారింది.
ఇదిలా ఉండగా తెలంగాణ తో పాటుగా ఏపీలో కూడా కరోనా వైరస్ ప్రమాద గంటలు మోగిస్తుంది.ఈ నేపధ్యంలో కేసుల నివారణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆశించినంత ఫలితాలను ఇవ్వడం లేదు.
అదీ గాక కోవిడ్ రోగులకు ఆక్సిజన్, వ్యాక్సినేషన్ అందించడంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది.దీనికి తోడు వర్షాలు జతకట్టడంతో ఇక్కడి ప్రజల్లో ఆందోళన పెరిగిపోయింది.
ఇకపోతే గతరాత్రి కురిసిన వర్షాలకు గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
దీని కారణంగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న రోగుల బాధలు వర్ణాతీతంగా మారాయి.
ప్రాణ వాయువు కోసం వీరు చేస్తున్న ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి.ఇలా సుమారు గంట నుంచి ఇక్కడ పవర్ లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని దుస్దితి నెలకొనడం బాధాకరం.