కరోనా వ్యాప్తి సమయంలో బాధితుల నుంచి రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ప్రభుత్వం వేటు వేసింది.
నిబంధనలు అమలు చేయని ఆస్పత్రుల్లో కరోనా చికిత్స చేయడానికి అనుమతులను రద్దు చేసింది.హైదరాబాద్ లోని పెద్ద కార్పొరేటర్ ఆస్పత్రుల్లో కరోనా వేళ బాధితుల నుంచి క్యాష్ చేసుకునేందుకు యత్నిస్తున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం బంజారాహిల్స్ లోని విరించి ఆస్పత్రిపై వేటు వేసింది.ఈ ఆస్పత్రిలో గత కొద్దిరోజులకు కరోనా పేషంట్ల నుంచి రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.దాడి నిర్వహించిన అధికారులు కరోనా రోగుల నుంచి రోజుకు రూ.లక్ష వసూలు చేసినట్లు నిర్ధారించారు.దీంతో మంగళవారం రాత్రి నుంచి కరోనా వైద్యం చేయకూడదని ఆ ఆస్పత్రికి ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త రోగులను జాయిన్ చేయించుకోవద్దని, ప్రస్తుతం ఉన్న కోవిడ్ బాధితులను చికిత్స అందించాలని పేర్కొంది.
వార్డులను బట్టి కరోనా చికిత్సకు ఎంత ఛార్జీలు వసూలు చేస్తున్నారనే అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.వెంటిలేటర్ పై ఉన్న బాధితుడి నుంచి రోజుకు రూ.10 వేలు మించి డబ్బులు తీసకోవద్దనే నిబంధనలు ఉన్నారు.ఈ నిబంధనను బేఖాతరు చేసి రూ.లక్షల్లో బిల్లు వసూలు చేసిన ఓ ఆస్పత్రిని కూడా ప్రభుత్వం కోవిడ్ లైసెన్స్ రద్దు చేసింది.