దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ భయంకరంగా ఉన్న సంగతి తెలిసిందే.గడచిన 24 గంటల్లో దేశంలో దాదాపు 3.46 కొత్త పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.మరోపక్క దేశవ్యాప్తంగా కరోనా రోగులకు చికిత్స విషయంలో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఏర్పడుతూ ఉండటంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా చాలా రాష్ట్రాలలో విద్యా సంస్థలు మరియు పరీక్షలు ప్రభుత్వాలు రద్దు చేస్తూ ఉన్నా సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఈ విధంగానే స్కూల్స్ మరియు కాలేజీలకు సెలవులు ప్రకటిస్తూ పుదుచ్చేరి విశ్వవిద్యాలయం నిర్ణయం తీసుకుంది.
పాండిచేరి యూనివర్సిటీ గా మంచి పేరు ఉన్న ఈ విద్యాలయంలో అనేక మంది విద్యార్థులు మరియు సిబ్బంది కరోనా బారిన పడటంతో ఈనెల 25 లోపు విద్యార్థులందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలని .యూనివర్సిటీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఏప్రిల్ 26 నుండి యూనివర్సిటీ మెస్ మరియు హాస్టల్ అంత క్లోజ్ చేస్తున్నట్లు విశ్వవిద్యాలయం సిబ్బంది ప్రకటించడం జరిగింది.పాండిచ్చేరి లో కూడా భారీగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.