అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది.రోజు రోజుకి కరోనా మరణాలా సంఖ్య అమాంతం పెరిగిపోవడంతో ప్రభుత్వం సైతం ఏమి చేయాలని పరిస్థితిలో నిమ్మకుంది పోతోంది.
కేవలం కరోనాకి విరుడుగు వ్యాక్సిన్ వస్తే తప్ప అమెరికాలో ఈ మృత్యు ఘోష ఆగేలా లేదని అంటున్నారు వైద్యులు.అమెరికాలో కేవలం నిన్న ఒక్క రోజులోనే 1227 మంది మృతి చెందారని ఈ స్థాయిలో రోజు రోజుకి కరోన మృతుల కేసులు ప్రస్తుతం నమోదు అవుతున్నాయని తెలుస్తోంది.ఇదిలాఉంటే…
అమెరికాలో మే నెలలో మాత్రమే ఈ స్థాయిలో మరణాల సంఖ్య నమోదు అయ్యిందని అప్పట్లో 1200 మరణాలు రోజుకి నమోదు అయ్యి సంచలనం సృష్టించగా కేవలం నిన్న ఒక్కరోజులోనే 1227 మంది మృతి చెందారని తెలుస్తోంది.అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలైన కాలిఫోర్నియా , ఫ్లోరిడాలలో రికార్డ్ స్థాయిలో మరణాలు నమోదు అయ్యాయని ఈ రెండు రాష్ట్రాలలోనే 362 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది.అంతేకాదు
అమెరికాలో మిగిలిన రాష్ట్రాలైన మోంటానా , ఆర్కనాస్ అరిగాన్ రాష్ట్రాలలో కూడా మరణాల సంఖ్య అధికంగానే నమోదు అయ్యిందని తెలుస్తోంది.గడించిన వారాంతరంలో సుమారు 1000 కి పైగా మరణాలు నమోదు కాగా కేవలం నిన్న ఒక్కరోజులోనే సుమారు 64 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యింది.దాంతో ఇప్పటి వరకూ అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 45 లక్షలలు కాగా మృతుల సంఖ్య 1.52 లక్షలకి చేరుకుంది.