తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతుండగా మరో వైపు కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
ఇకపోతే తెలంగాణా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ నమోదైన కోవిడ్19 కేసుల వివరాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది.
ఈ తాజా బులిటెన్ ప్రకారం.
కొత్తగా 150 మంది కరోనా బారిన పడ్డారట.అదే సమయంలో కరోనా కాటుకు ఇద్దరు బలైయ్యారని వెల్లడించారు.
దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581కి చేరుకోగా, ఇందులో 2,92,032 మంది కరోనా నుంచి కోలుకున్నారని, 1939 కేసులు యాక్టివ్గా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
అయితే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.2 శాతంగా ఉండగా, మరణాల రేటు 0.54 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది.ఇకపోతే కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 25 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయట.కాగా, రాష్ట్రంలో రెండో విడుత కొవిడ్ వ్యాక్సినేషన్ కూడా నిన్న శనివారం ప్రారంభమయ్యింది.