ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఎంతగా కలకలం సృష్టిస్తోందో కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఇప్పటికే ఈ కరోనా వైరస్ మహమ్మారి ని అదుపు చేసేందుకు లాక్ డౌన్ మరియు వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదలు పెట్టినప్పటికీ కరోనా వైరస్ మాత్రం అదుపులోకి రావడం లేదు.
ఇప్పటికే మొదటి మరియు సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా పలు పారిశ్రామిక రంగాలు ఆర్థికపరంగా పూర్తిగా దెబ్బతిన్నాయి.అయితే ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.
కానీ అంతా సర్దుమణుగుతున్న సమయంలో మళ్ళీ దేశ వ్యాప్తంగా మరోమారు థర్డ్ వేవ్ ప్రకంపనలు మొదలయ్యాయి.దీంతో పలువురు ప్రముఖ వైద్య శాస్త్రవేత్తలు ఈ విషయంపై స్పందిస్తూ ఈ థర్డ్ వేవ్ లో ఎక్కువగా 18 సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి యువకులు మరియు చిన్న పిల్లలు కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అంతేకాకుండా కరోనా వైరస్ లక్షణాలను పిల్లలలో గమనించినట్లయితే వెంటనే వారిని దగ్గరలో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించి తగిన చికిత్స అందించాలని సూచిస్తున్నారు.అంతేకాకుండా ముఖ్యంగా ఈ థర్డ్ వేవ్ పక్షులు మరియు చికెన్ కోళ్ల ద్వారా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొందరు వైద్య నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఒక్కసారిగా చికెన్ కోళ్ల ఫారం యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా కలకలం సృష్టిస్తోంది.దీంతో ఇప్పటికే ఈ కరోనా వైరస్ కారణంగా దాదాపుగా 4 లక్షల మందికి పైగా ప్రజలు మృతి చెందారు.అంతేకాకుండా దాదాపుగా రోజుకి మూడు లక్షల పైచిలుకు మంది ప్రజలు ఈ కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
దీంతో వైద్యులు ప్రజలు బాహ్య ప్రపంచంలో సంచరించేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించడం, అలాగే నిత్యం శానిటైజర్ తో చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.