గత కొద్ది నెలల క్రితం వరకు దేశంలో కరోనా పూర్తిగా తగ్గినట్లే తగ్గి మళ్ళీ పుంజుకుంటున్న విషయం తెలిసిందే.ఇలా దేశంలో వైరస్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండగా మరోవైపు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.
ఇదిలా ఉండగా కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ దేశంలో గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను వెల్లడించింది.ఆ వివరాలు చూస్తే.ఇప్పటివరకు దేశంలో రికార్డు స్థాయిలో 72,330 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, గతేడాది అక్టోబర్ తర్వాత భారీగా పాజిటివ్ కేసులు రావడం ఇదే మొదటిసారని వెల్లడించింది.
ఇకపోతే తాజాగా 459 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోగా, దేశంలో ఒక్కరోజులో ఎక్కువ మరణాలు సంభవించడం ఇదే తొలిసారని వెల్లడించింది.
ఇదిలా ఉండగా దేశంలో కొత్తగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,22,21,665 కు చేరగా, ఇప్పటి వరకు 1,14,74,683 మంది కోలుకోగా, 1,62,927 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారని, ప్రస్తుతం దేశంలో 5,84,055 యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.