దేశంలో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. !

గత కొద్ది నెలల క్రితం వరకు దేశంలో కరోనా పూర్తిగా తగ్గినట్లే తగ్గి మళ్ళీ పుంజుకుంటున్న విషయం తెలిసిందే.ఇలా దేశంలో వైరస్‌ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండగా మరోవైపు పాజిటివ్‌ కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.

 Covid 19 Cases Bulletin Of India , India, Corona Cases, Reports, Covid 19, Coro-TeluguStop.com

ఇదిలా ఉండగా కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ దేశంలో గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను వెల్లడించింది.ఆ వివరాలు చూస్తే.ఇప్పటివరకు దేశంలో రికార్డు స్థాయిలో 72,330 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, గతేడాది అక్టోబర్‌ తర్వాత భారీగా పాజిటివ్‌ కేసులు రావడం ఇదే మొదటిసారని వెల్లడించింది.

ఇకపోతే తాజాగా 459 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోగా, దేశంలో ఒక్కరోజులో ఎక్కువ మరణాలు సంభవించడం ఇదే తొలిసారని వెల్లడించింది.

ఇదిలా ఉండగా దేశంలో కొత్తగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,22,21,665 కు చేరగా, ఇప్పటి వరకు 1,14,74,683 మంది కోలుకోగా, 1,62,927 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారని, ప్రస్తుతం దేశంలో 5,84,055 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube