కరోనా వైరస్.ప్రపంచాన్ని నాశనం చేసింది.అన్ని విధాలుగా కోలుకునే స్థితి లేకుండా చేసింది.ఆర్ధికంగా కొందరు నష్టపోతే ఆరోగ్యం పరంగా కొందరు నష్టపోయారు. ప్రపంచవ్యాప్తంగా 8 లక్షలమందిని కరోనా వైరస్ బలితీసుకుంది.ఈ కరోనా వైరస్ లక్షణాల గురించి, కరోనా వైరస్ కారణంగా జరిగే నష్టాల గురించి నెమ్మదిగా ఒక్కోటి బయటపడుతున్నాయి.
కరోనా వైరస్ లో కొత్త లక్షణాలు రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి.ఒకసారి కరోనా వైరస్ కొత్త లక్షణం అని ఎక్కిళ్ల గురించి చెప్తే మరోసారి జుట్టు రాలిపోతుందని కొత్త అధ్యయనాల్లో బయటపడుతుంది.
ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ భారిన పడిన పడి మృతి చెందిన వారిలో వింత లక్షణాలు కనిపిస్తున్నట్టు పరిశోధకులు చెప్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
కరోనా వైరస్ మృతుల పోస్టుమార్టం రిపోర్టుల ద్వారా కీలక విషయాలు కనుగొన్నట్లు లండన్ పరిశోధకులు ప్రకటించారు.కరోనాతో చనిపోయిన వారి ఊపిరితిత్తుల్లో గాయాలు, రక్తం గడ్డ కట్టడం వంటివి ఉన్నాయని తెలిపారు.
అలాగే ప్రారంభ లక్షణాలుగా ఊపిరితిత్తుల్లో మచ్చలు, కిడ్నీల్లో గాయాలు అయ్యాయని వెల్లడించారు.తమ పరిశోధనలు రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు, సరైన చికిత్స అందించేందుకు ఉపయోగపడుతాయని చెప్పారు.