రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు, అక్కడి వ్యూహాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వేగులు ఉంటుంటారు.ఆ పార్టీలో ప్రత్యర్థి పార్టీల వేగులు ఉంటే, ప్రత్యర్థి పార్టీల్లో అపొజిషన్ వేగులు ఉండడం కామన్.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు కేబినెట్లోనే సాక్షాత్తూ కోవర్టులు ఉన్నట్టు, ఈ విషయం చంద్రబాబు కూడా గ్రహించినట్టు వార్తలు వస్తున్నాయి.
బాబు తన కేబినెట్లోని మంత్రి గంటా శ్రీనివాసరావు వైఖరిపై ముందునుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆయన ఇప్పటికే పలు పార్టీలు మారి టీడీపీలోకి వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా గంటాపై చంద్రబాబుకు ఉన్న అనుమానాలపై పవన్కళ్యాణ్ భేటీతో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.
చంద్రబాబుతో భేటీలో పవన్ సీఆర్డీఏ తీసుకున్న కొన్ని సీక్రెట్ డెసిషన్లను కూడా చెప్పడంతో చంద్రబాబు షాక్ అయిపోయారట.ఈ విషయాలు ఎవరు చెప్పారని అడగకున్నా చంద్రబాబుకు ఇది గంటాశ్రీనివాసరావు పనేనని అర్ధమయింది.
వాస్తవానికి గంటా శ్రీనివాసరావు విషయంలో చంద్రబాబు ముందు నుంచి తీవ్ర అసంతృప్తితోనే ఉంటున్నారు.
లేటెస్ట్గా విశాఖలో భూ కుంభకోణం కేసులోనూ గంటాశ్రీనివాసరావు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా చేశారు.
సీబీఐ దర్యాప్తు జరిపించాలని లేఖ రాయడంతో బాబు తీవ్ర అసంతృప్తి చెందారు.వాస్తవానికి గంటా శ్రీనివాసరావును బాబు మంత్రివర్గం నుంచి తప్పించాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, సామాజిక సమీకరణలే ఆయనకు అడ్డంకిగా మారాయి.
ఇక గంటా తనయుడు ఇప్పటికే జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో గంటా తనయుడికి ఎమ్మల్యే సీటు ఇవ్వకోతే జనసేన నుంచి కూడా రవితేజ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
కేబినెట్లో జరిగిన కీలక విషయాలను కూడా గంటా లీక్ చేస్తుండడంతో బాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.పవన్ కు, గంటాకు ప్రజారాజ్యం పార్టీ నుంచే మంచి సంబంధాలుండటంతో జాగ్రత్తగా డీల్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.
.