ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి.ఇప్పటికే పలుచోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.
తాజాగా హైదరాబాద్లోని నిమ్స్ కేంద్రంగా పనిచేస్తున్న వ్యాక్సిన్ తయారీ బృందం మొదటి దశ ట్రయల్స్ ప్రారంభించింది.
క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఇద్దరు వాలంటీర్లకు వైద్యులు కొవాగ్జిన్ అనే వ్యాక్సిన్ను ఇచ్చారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తోంది.హైదరాబాద్లోని భారత్ బయోటెక్కు చెందిన బయోసేఫ్టీ లెవెల్ 3 ప్రయోగశాలలో ఈ టీకాను తయారు చేశారు.
భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ వ్యాక్సిన్ మొదటి, రెండో క్లినికకల్ ట్రయల్స్ జరిపేందుకు ఇండియన్ డ్రగ్ రెగ్యులేటరీ అనుమతి ఇచ్చింది.దీంతో కొవాగ్జిన్ను డాక్టర్లు విజయవంతంగా నిమ్స్లో ఇద్దరు వాలంటీర్లపై ప్రయోగించారు.
ఆ ఇద్దరిని రెండు రోజుల పాటు ఆబ్జర్వేషన్లో ఉంచనున్నారు.రెండు వారాల తర్వాత రెండో వ్యాక్సిన్ను ప్రయోగించనున్నారు.
దేశవ్యాప్తంగా మొత్తం 12 వైద్య కేంద్రాల్లో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని ఐసీఎంఆర్ ప్రకటించింది.దేశీయంగా అభివృద్ధి చేస్తున్న తొలి వ్యాక్సిన్ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపైనే పడింది.
ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ను సిద్ధం చేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది.