ఈ మధ్యకాలంలో కొందరు నీచులు వావివరుసలు మరచి సొంత ఆడవారిని కూడా చూడకుండా అత్యాచారాలు చేస్తున్నారు కొందరు.అయితే ఇద్దరు సోదరులు సొంత సోదరి అని కూడా చూడకుండా మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశారు.
తన సోదరి మైనర్ బాలిక అనే కనికరం లేకుండా కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.ఈ సంఘటన బీహార్ లోని చంపారణ్ జిల్లాలో చోటు చేసుకుంది.
అసలు విషయంలోకి వెళితే… అత్యాచారానికి బలైన బాధితురాలు స్థానికంగా ఓ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాయి.రోజు మాదిరి పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతికి సొంత బాబాయి కుమారులైన ఇద్దరు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు.
ఆమెకు మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చారు.ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయాక అఘాయిత్యానికి పాల్పడ్డారు.ఆమెకు మెలుకవ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెబితే చంపేస్తామని బెదిరించారు.అంతేకాకుండా తాము ఎప్పుడైనా కోరిక కలిగితే అప్పుడు తమ వద్దకు రావాలని లేకపోతే చంపేస్తామని హెచ్చరించారు కూడా.
ఇలా ఆమె పై ఏకంగా మూడు నెలల పాటు అత్యాచారానికి ఒడిగట్టారు నీచులు.ఇక చివరికి వారి బాధ భరించలేక ఆమె మొత్తానికి తెగించి పోలీసులను ఆశ్రయించింది.తన సోదరుల పై కేసు పెట్టడంతో ఆమెను భౌతికంగా చంపేయాలని మాస్టర్ ప్లాన్ వేశారు.దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు తన ప్రాణాలకు హాని ఉందని చెప్పడంతో పోలీసులు ఆమెకు రక్షణ కల్పిస్తూ, నిందితుల ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.